టీఆర్‌ఎస్‌ ఎంపీ నామాకు ఈడీ షాక్‌..

16 Jun, 2021 12:46 IST|Sakshi
నామా నాగేశ్వరరావు ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసుకు సంబంధించిన ఈడీ నామాకు సమన్లు జారీ చేసింది. మధుకాన్‌ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. మధుకాన్‌ గ్రూప్‌ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల ఈడీ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. సోదాల్లో హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు, రూ.లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. 

చదవండి: నామాకు బిగుస్తున్న ఉచ్చు.. త్వరలోనే భారీ షాక్‌

>
మరిన్ని వార్తలు