AP: జెడ్పీ హైస్కూల్‌లో మాల్‌ ప్రాక్టీస్‌.. స్పందించిన విద్యాశాఖ

2 May, 2022 14:30 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: పసుమర్రు జెడ్పీ హైస్కూల్‌లో మాల్‌ ప్రాక్టీస్‌పై విద్యా శాఖ స్పందించింది. ప్రశ్నా పత్రాలు బయటకు వెళ్తున్నాయని టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ వచ్చిందని డిఈవో తాహిరా సుల్తానా తెలిపారు. ఐదుగురు టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు గుర్తించామన్నారు. టీచర్ల ఫోన్లు పోలీసులకు అప్పగించామన్నారు. ఆరుగురు టీచర్లను సస్పెండ్‌ చేసినట్లు డిఈవో వెల్లడించారు.
చదవండి: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి..

మరిన్ని వార్తలు