లాంగ్‌ డ్రైవ్‌కు వచ్చి ఇంజనీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

13 Feb, 2021 11:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాదాపూర్‌: లాంగ్‌డ్రైవ్‌ కోసం వచ్చిన ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు డివైడర్‌ను ఢీకొని మృత్యువాత పడ్డారు. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బీఎన్‌ రెడ్డి నగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న వినయ్‌కుమార్‌రెడ్డి(23) గురునానక్‌ కళాశాలలో,  సన్ని రామిరెడ్డి(21) శ్రీదత్త కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు.  డ్యూక్‌ బైక్‌ పై లాంగ్‌డ్రైవ్‌ కోసం ఎల్బీనగర్‌ నుంచి డీఎల్‌ఎఫ్‌ వెళ్తూ కొత్తగూడలో డివైడర్‌ను ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ‘డేటింగ్‌ ట్రాప్‌’ ముంబై వ్యక్తి పనే..

మరిన్ని వార్తలు