నిందితుల ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఓకే

8 Sep, 2020 19:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతివ్వాలంటూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఏసీబీ ఆస్తుల జప్తునకు తాత్కలిక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి ఆస్తులు జప్తు చేశారు.పద్మ, ఆమె కుటుంబసభ్యుల పేరు మీదున్న 8.55 కోట్ల రూపాయల ఆస్తులు.. నాగలక్ష్మీకి చెందిన 2.72 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేయనున్నారు. 

మరిన్ని వార్తలు