వివాహేతర సంబంధం.. భార్య ప్రియుడు గ్రామానికి వచ్చాడని తెలిసి..

13 Nov, 2021 08:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,  తిరువొత్తియూరు(తమిళనాడు): కన్యాకుమారి జిల్లా తక్కలైలో నడిరోడ్డుపై భార్య ప్రియుడిని భర్త తన మిత్రులతో కలిసి కత్తులతో దాడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బుధవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ దాడి జరిగింది. గాయపడిన అతన్ని స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లగా పారిపోయాడు.

విచారణలో తక్కలై సమీపంలోని తిరువిదాంగోడుకు చెందిన పూజారి (45)కి భార్య (34), ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యకు వేరొకరితో వివాహేతర ఏర్పడడంతో 8 నెలల కిత్రం అతనితో పారిపోయింది. దీనిపై తక్కలై పోలీస్‌స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. భార్య ప్రియుడు తక్కలైకి వచ్చినట్లు సమాచారం తెలియడంతో మిత్రులతో కలిసి కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు