సాక్షి, కృష్ణా: విజయవాడలో నకిలీ చలానాల వ్యవహారంలో భారీగా రికవరీ చేపట్టినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. కాగా, రూ. 3కోట్లను రికవరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్క పటమట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే రూ.1.22 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు.
మండవల్లి రైటర్ సుబ్రహ్మాణ్యం నుంచి రికవరీకి చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. మొత్తం నకిలీ చలానాలు ఒకే రైటర్ సృష్టించినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై విచారణ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.