దొంగనోట్ల ముఠా గుట్టురట్టు: 6 గురు అరెస్టు

31 Oct, 2021 18:16 IST|Sakshi

పశ్చిమగోదావరి: బుట్టాయిగూడెంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా జంగారెడ్డి గూడెం, పోలవరం ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులు  గుర్తించారు.

వీరి దగ్గరి నుంచి రూ.12 లక్షల నకిలీ కరెన్సీ, 3 బైకులు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

చదవండి: ఎయిడెడ్‌ స్కూల్స్‌ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి

మరిన్ని వార్తలు