వివాహేతర సంబంధం: తండ్రీ కొడుకుల ఆత్మహత్య

28 Feb, 2021 08:41 IST|Sakshi

టీ.నగర్‌: నామక్కల్‌లో తండ్రి, కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. సేలం జిల్లా, మల్లూరు ప్రాంతానికి చెందిన సుబ్రమణి (55) కార్మికుడు. ఇతనికి ఇద్దరు కుమారులు శంకర్‌ (25), కృష్ణన్‌ (21). వీరు నామక్కల్‌ జిల్లా ముత్తుకాపట్టిలోని ఇటుక బట్టిలో పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కొల్లంపట్టికి చెందిన భాస్కర్‌ భార్య సత్యతో  చిన్న కుమారుడు కృష్ణన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. 15 రోజుల క్రితం వీరిద్దరూ ఇంటి నుంచి పరారయ్యారు. ఈ విషయంగా పోలీసులు విచారణ జరపడంతో అవమానం భరించలేక తండ్రి సుబ్రమణి, పెద్ద కుమారుడు శంకర్‌ శుక్రవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  

చదవండి: క్రికెట్‌ బెట్టింగ్‌కు ఇంజనీరింగ్‌ విద్యార్థి బలి

మరిన్ని వార్తలు