నల్గొండలో దారుణం: ఇద్దరి పిల్లలకు విషమిచ్చి.. ఉరేసుకున్న తండ్రి

24 Dec, 2021 10:26 IST|Sakshi

సాక్షి,నల్లగొండ: దామరచర్ల మండలం నునవత్ తండాలో విషాదం చోటు చేసుకుంది. ఆ ఇంట ఏం జరిగిందో.. ఓ తండ్రి తన ఇద్దరి పిల్లలకి విషమిచ్చి, తర్వాత అతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఈఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

చదవండి: వివాహేతర సంబంధం.. శరీరం నుంచి తలను వేరుచేసి..

మరిన్ని వార్తలు