సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి మామను హత్య చేసిందో కోడలు. వివరాల్లోకెళ్తే.. పరిగి మండలం నసకల్ గ్రామానికి చెందిన మంగమ్మ భర్త నరసింహులు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మరణించిన తర్వాత మరో వ్యక్తితో మంగమ్మ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.
ఈ విషయాన్ని గమనించిన మామ కృష్ణయ్య పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో వారి బంధానికి అడ్డొస్తున్నాడని భావించి ప్రియుడితో కలిసి తన మామను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మంగమ్మను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.