మైనర్‌ కూతురిపై కన్నేసిన తండ్రి..

28 Nov, 2021 15:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని చిరాగ్‌ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గత జూన్‌, ఆగస్టునెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన ఢిల్లీలోని చిరాగ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. నిందితుడు సదరు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఒక మైనర్‌ కూతురు ఉంది.

ఈ క్రమంలో ఆ కామాంధుడి కళ్లు అభం శుభం తెలియని కూతురుపై పడ్డాయి. కన్న తల్లి ఇంట్లో లేనప్పుడు కూతురుపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులకు బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావడంతో ఆమెను తల్లి ఆసుపత్రకి తీసుకెళ్లింది. ఆ సమయంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. కాగా, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు