కన్న కూతురిపై కసాయి తండ్రి దారుణం

23 Mar, 2022 13:03 IST|Sakshi
పత్రీకాత్మక చిత్రం

సాక్షి, రాజేంద్రనగర్‌: కన్న కూతురుపై ఓ కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్‌ బాలిక విషయాన్ని తల్లికి తెలపగా ఆమె విషయాన్ని రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి కిస్మత్‌పూర్‌లో కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. వీరికి 9 ఏళ్ల కూతురు సంతానం కాగా సోమవారం రాత్రి కన్న కూతురుపై తండ్రి లైంగిక దాడికి దిగాడు.

బంధువుల ఇంటికి వెళ్లిన భార్య తిరిగొచ్చాక ఉదయం కూతురు జరిగిన విషయాన్ని తల్లికి తెలపడంతో భర్తను నిలదీసింది. వారిని చితకబాదిన అతడు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. దీంతో స్థానికుల సహాయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వైద్య పరీక్షల కోసం చిన్నారిని  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు