మహిళా లెక్చరర్‌ ఆత్మహత్య 

16 Apr, 2021 14:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ప్రైవేటు కళాశాల లెక్చరర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని గాంధీబజార్‌ రోడ్డులో నివాసం ఉంటున్న స్వాతి (28) బుధవారం అర్ధరాత్రి తన గదిలో ఉరి వేసుకుంది. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న దొడ్డపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.  

అత్త, మామలపై కత్తితో దాడి 
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద నివసిస్తున్న శ్రీనివాస్, జయమ్మ దంపతుల కుమార్తె కమలను ఇటీవలే మంజునాథ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహం జరిగిన కొన్ని రోజులకే ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. దీంతో ఇందుకు కారణం అత్త, మామ అని కక్ష పెంచుకున్న మంజునాథ్‌ గురువారం ఉదయం భార్య ఇంటికి నేరుగా వెళ్లి గొడవపడ్డాడు. మంజునాథ్‌ అత్త మామలను కత్తితో పొడిచాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ దంపతులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు