పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం..

31 Jul, 2020 09:15 IST|Sakshi

సాక్షి, గుంటూరు: పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. నాదెండ్ల మండలం గణపవరంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గౌడౌన్‌లో నిల్వ ఉంచిన ప్రత్తి దగ్ధం అయ్యింది. రూ.40 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. విద్యుత్‌ షార్ట్‌ సర్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని సిబ్బంది  తెలిపారు. ఫైర్ సిబ్బంది  స్థలానికి చేరుకుని  మంటలను అదుపు చేశారు.

మరిన్ని వార్తలు