కాకినాడ జీఎంఆర్‌ పవర్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

25 Sep, 2021 10:06 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని కాకినాడ పట్టణంలో ఉన్న జీఎంఆర్ పవర్ ప్లాంట్ వద్ద శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి... దట్టమైన పొగ వ్యాపిస్తుంది. అయితే ఈ పవర్‌ ప్లాంట్‌ కొన్నేళ్లుగా పని చేయడం లేదు. దీంతో ప్లాంట్‌లో ఎవరూ లేరు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 

చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో..

మరిన్ని వార్తలు