Junior Lineman Paper Leak Case: పేపర్‌ లీక్‌ వ్యవహారం.. ఐదుగురు అధికారుల సస్పెన్షన్‌

29 Jul, 2022 09:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ జూనియర్‌ లైన్‌మెన్‌ పేపర్‌ లీక్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. లీక్‌లో ఐదుగురు విద్యుత్‌ అధికారులు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీరిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, జీహెచ్‌ఎంసీ అత్యవసర భేటీ

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం జులై 17,2022 న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదు మంది ఉద్యోగుల ప్రమేయంతో మాల్ ప్రాక్టీస్‌ జరిగినట్లు తేలింది. మొహమ్మెద్ ఫిరోజ్ ఖాన్, సపావత్ శ్రీనివాస్, కేతావత్ దస్రు, షైక్ సాజన్, మంగళగిరి సైదులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.
 

మరిన్ని వార్తలు