పనికోసం ఇంటికొస్తే వ్యభిచారం చేయించారు..

3 May, 2022 16:12 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): పనికోసం ఇంటికి వచ్చిన మైనర్‌ బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో భవానీపురం పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో విజయవాడ చిట్టినగర్‌ సొరంగం ప్రాంతానికి చెందిన వేముల భాగ్యలక్ష్మి, కబేళా సెంటర్‌కు చెందిన వేముల భార్గవి, వేముల గోపి, పమిడి ముక్కల మండలం తాడంకి గ్రామానికి చెందిన చలపాటి శ్రీనివాసరావు, గుంటూరు చంద్రమౌళి నగర్‌కు చెందిన పోపూరి వెంకట రవికుమార్‌లను అరెస్ట్‌ చేసినట్లు సీఐ మహీంద్ర తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించామన్నారు.  

చదవండి: (Hyderabad: అద్దె ఇల్లు చూసేందుకు వచ్చి... ఇంట్లోనే సన్నిహితంగా)

మరిన్ని వార్తలు