మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష

12 Aug, 2021 19:20 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష పడింది. ఆయనకు 6 నెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువైనట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు వెల్లడించింది.

2018లో అశ్వాపురం పీఎస్‌లో పాయం వెంకటేశ్వర్లుపై ఈ మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై కోర్టు గురువారం విచారణ జరిపి, తీర్పు నిచ్చింది. ఆయన రూ. 10 వేల జరిమానాను కట్టారు.. అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధపడటంతో కోర్టు జైలు శిక్ష నిలిపివేసింది.

మరిన్ని వార్తలు