టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్‌

24 May, 2021 07:55 IST|Sakshi

సాక్షి, కర్నూలు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బనగానపల్లె పాత బస్టాండ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు జనార్ధన్‌రెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉంది.  కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

చదవండి: వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై టీడీపీ నేతల దాడి
ఈ–పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి

మరిన్ని వార్తలు