తెలుగు అకాడమీ కేసు: కస్టడీకి నలుగురు నిందితులు

9 Oct, 2021 16:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. నలుగురు నిందితులను చంచల్ గూడ జైల్ నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సత్యనారాయణ, పద్మావతి, మొహిద్దీన్‌ను కస్టడీకి తీసుకోగా, ఇప్పటికే యూబీఐ మేనేజర్‌ మస్తాన్‌వలీని పోలీసులు ప్రశ్నించారు. నాలుగో రోజు కూడా మస్తాన్‌వలీని కస్టడీలోకి తీసుకున్నారు. కొట్టేసిన డబ్బును ఎక్కడ దాచారన్న దానిపై పోలీసులు ఆరా తీయనున్నారు.
చదవండి:
Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం

మరిన్ని వార్తలు