విషాదం: నలుగురు చిన్నారులు మృతి

29 Aug, 2020 20:24 IST|Sakshi

భోపాల్‌‌: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కట్నీ జిల్లా బన్హారా గ్రామంలో ఓ గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇంటి బయట గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చెరుకున్నారు. మృత దేహాలను స్థానిక ఉమ్రియాపాన్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు