తీవ్ర విషాదం: బీజేపీ నేత కుటుంబం ఆత్మహత్య

22 Feb, 2021 08:39 IST|Sakshi

బీజేపీ నేత ఇంట్లో విషాదం : నలుగురు ఆత్మహత్య

పెద్ద కుమారుడి మరణంతో తీవ్ర మనస్థాపం

సాక్షి, జైపూర్‌: రాజస్థాన్లో‌ని సికార్ జిల్లాలో  షాకింగ్‌ ఉదంతం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబానికి  చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం విషాదం నింపింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇటీవల తమ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిన బాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. మృతులను హనుమాన్ ప్రసాద్ సైనీ, మదన్‌లాల్‌ భార్య తారా,  ఇద్దరు కుమార్తెలు అంజు,  పూజలుగా గుర్తించారు.  

మదన్ లాల్ గత ఏడాది సెప్టెంబరులో పెద్ద కుమారుడిని కోల్పోయారు. దీంతో కుటుంబంలోని వారంతా తీవ్ర మానసిక వ్యధకు లోనయ్యారు. ఈ నేపధ్యం లోనే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మదన్ లాల్‌‌ సోదరుని కుమారుడు హనుమాన్ ప్రసాద్ సైనీ రాసినదిగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత బతకాలనే ఆశలేదంటూ ప్రసాద్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి వీరేంద్ర శర్మ తెలిపారు.  

మరిన్ని వార్తలు