కేటీఆర్‌ పీఏనంటూ టోకరా

6 Mar, 2021 12:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నిందితుడిని మాజీ రంజీ క్రికెట్‌ ప్లేయర్‌గా గుర్తించారు. వ్యాపారులు, ఆస్పత్రుల నుంచి భారీగా నగదు వసూళ్లకు పాల్పడేవాడని నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


చదవండి:
మిస్సింగ్‌ కేసు: బాలికకు మాయమాటలు చెప్పి..
స్నేహితురాలితో వీడియో కాల్ మాట్లాడుతోందని‌..

మరిన్ని వార్తలు