Yadadri: చెరువులో దూకి యువతి ఆత్మహత్య

30 Sep, 2021 15:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: భువనగిరి మండలం రాయగిరి చెరువులో దూకి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, స్థానికుల సమాచారంతో పోలీసులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు కట్టపై లభించిన సెల్‌ఫోన్‌, ఇతర వస్తువుల ఆధారంగా యువతి.. హైదరాబాద్‌ లాలాపేట్‌కు చెందిన గీతా రాణి(26)గా పోలీసులు గుర్తించారు.

ఆ తర్వాత పోలీసులు యువతి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.  

చదవండి: ‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి..

మరిన్ని వార్తలు