తల్లికి సందేశం పంపి బాలిక ఆత్మహత్య
బనశంకరి(కర్ణాటక): అమ్మా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను... నన్ను క్షమించు అంటూ తల్లి మొబైల్కు మెసేజ్ చేసి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హాసనలో చోటుచేసుకుంది. స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పూర్విక (15) తల్లికి సందేశం పంపి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వచ్చే లోపే బాలిక చెరువులో దూకింది. అగ్నిమాపక సిబ్బంది మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరావడం లేదు.