ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య

30 Jul, 2020 20:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : నగరంలోని చినముషిడివాడలోని శ్రామిక నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ యువతి ప్రియుడి నివాసం ఉండే ఐదంస్తుల అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా రాష్ట్రం రాయగడ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల కావేటి వైష్ణవి, చినముషిడివాడకు చెందిన షణ్ముఖ తేజలు విశాఖలోని ఓ ప్రైవేటు సంస్థలో వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇలా కొంతకాలం నుంచి వీరు ప్రేమలో ఉన్నారు. 

ఈ క్రమంలోనే వైష్ణవి గురువారం మధ్యాహ్నం చినముషిడివాడలో తేజ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. అక్కడ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం వైష్ణవి అపార్ట్‌మెంట్‌ పైనుంచి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, తేజ పెళ్లికి నిరాకరించడం వల్లనే వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు