అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నిర్వాకం

12 Oct, 2021 11:36 IST|Sakshi

హైదరాబాద్: నాగోల్‌లో రికార్డు డ్యాన్సులు కలకలం సృష్టించాయి. పీఎంఆర్‌ ఫంక్షన్ హాల్‌లో ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వార్సికోత్సవంలో అమ్మాయిలతో అశ్లీల నృత్యా‍లు చేయించింది. అమ్మాయిలు మద్యం మత్తులో చిందులు వేశారు.

సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కంపెనీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లను అదుపులోకి  తీసుకున్నారు. డాన్సర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు 

మరిన్ని వార్తలు