భారీగా బంగారం, నగదు పట్టివేత

10 Apr, 2021 15:23 IST|Sakshi

సాక్షి, కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం, నగదును పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల 5లక్షల 35వేల 500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్‌ చేశారు. మరో  ఇద్దరు వ్యక్తుల నుంచి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు, బంగారం సీజ్ చేశారు. ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు తరలిస్తుండగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


చదవండి:
వాహనాలకు నకిలీ బీమా.. వారే సూత్రధారులు
తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం

మరిన్ని వార్తలు