ప్రయాణికుడి వద్ద బంగారం పట్టివేత  

14 Sep, 2021 04:50 IST|Sakshi

శంషాబాద్‌: ఓ ప్రయాణికుడు అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు సోమవారం రియాద్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్‌ అధికారులకు లోదుస్తుల్లో ప్రయాణికుడు దాచిన 100 గ్రాముల బంగారు కడ్డీ బయటపడింది. దీని విలువ సుమారు 4.90 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు