ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం: మాజీ మంత్రిపై కేసు

19 Nov, 2021 07:07 IST|Sakshi

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.3.30 కోట్లు నగదు వసూలు చేసి.. మోసం చేశారంటూ మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీపై కేసు నమోదు చేశారు. విరుదునగర్‌ జిల్లా క్రైం విభాగం పోలీస్‌స్టేషన్‌లో సాతనూరుకు చెందిన రవీంద్రన్‌ ఓ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీమంత్రి రాజేంద్రబాలాజీ, బలరామన్, బాబురామ్, ముత్తుపాండిపై విరుదునగర్‌ జిల్లా క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు