హ్యాకింగ్ బారిన బిగ్బాస్కెట్
2 కోట్లకుపైగా యూజర్ల డేటా హ్యాక్
మెయిల్, ఫోన్, లాంటి వ్యక్తిగత డేటా చోరీ
రూ. 30 లక్షలకు డార్క్ వెబ్లో హ్యాకర్ల విక్రయం
సాక్షి, ముంబై: గ్రోసరీ ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల వ్యక్తిగత డేటా హ్యాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా బిగ్బాస్కెట్ వెల్లడించింది. తమ కంపెనీ పై హ్యకర్లు దాడి చేశారని బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ సంస్థకు చెందిన 2 కోట్లకు పైగా ఖాతాదారుల డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది.
డేటా ఉల్లంఘనలను గుర్తించే సైబుల్ నివేదిక ప్రకారం, హ్యాకర్లు ఈ డేటాను రూ. 30 లక్షలకు డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. మొత్తం 2కోట్ల మందికి చెందిన 15 జీబీ డేటాను హ్యాకర్లు తస్కరించారు. ఇందులో వినియోగదారుల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్, అడ్రస్, పుట్టినతేదీ, లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే క్రెడిట్ కార్డ్, ఇతర ఫైనాన్షియల్ వివరాలు క్షేమంగానే ఉంటాయని కంపెనీ చెబుతోంది. డేటా హ్యాకింగ్ను కొన్ని రోజుల కిందటే గుర్తించామనీ, ఏ స్థాయిలో డేటా చౌర్యం జరిగిందో తెలుసుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పింది. డార్క్ వెబ్ను మానిటర్ చేస్తున్నప్పుడు బిగ్బాస్కెట్కు చెందిన డేటా అమ్మకాన్ని గమనించామని సైబల్ తన బ్లాగ్లో పేర్కొంది. సుమారు రెండు కోట్ల మంది యూజర్ల డేటా ఇందులో ఉందని తెలిపింది.
బిగ్బాస్కెట్ వినియోగదారులు - జాగ్రత్తలు