పెళ్లికి ముందు రోజే రవళి ఆత్మహత్య.. కేసులో కీలక పురోగతి

22 Dec, 2022 10:54 IST|Sakshi

నవీపేట్‌(నిజామాబాద్‌ జిల్లా): నవీపేట్‌లో నవ వధువు ర్యాగల్ల రవళి ఆత్మహత్య కేసులో వేధింపులకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రా జారెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు.. డిసెంబ ర్‌ 11న పెళ్లికి ముందు రోజు ర్యాగల్ల రవళి ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమెను వేధింపులకు గురి చేసిన నిజామాబాద్‌ నగరానికి చెందిన సంతోష్‌పై మృతురాలి తండ్రి ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో సీడీఆర్‌ సహాయంతో బుధవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది.
చదవండి: కోర్టులో మహిళ షాకింగ్‌ ట్విస్ట్‌.. భర్త కోసం ఎంతకు తెగించిందంటే?    

మరిన్ని వార్తలు