మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి!

3 Jul, 2021 11:11 IST|Sakshi

బెంగళూరు: మృగాళ్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. మంచేనహళ్లి తాలూకాలోని ఒక గ్రామానికి చెందిన 14 సంవత్సరాలు వయసున్న బాలిక 8వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లోనే ఉండేది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన 7 మంది డబ్బు ఆశ పెట్టి ఆ బాలికపై నిరంతరంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇటీవల బాలిక అనారోగ్యంపాలు కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా గర్భిణి అయిన విషయం వెలుగు చూసింది.  బాలిక పోషకులు మంచేనహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం బాలికను మహిళా సాంత్వన కేంద్రంలో ఉంచారు. 

మరిన్ని వార్తలు