విషాదం: పీఎస్‌లో గన్‌ మిస్‌ఫైర్‌.. హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం

12 Feb, 2022 09:35 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలోని ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌లో తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

నైట్‌డ్యూటీలో ఉన్న సంతోష్ శనివారం తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సంతోష్‌ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో సంతోష్‌ మృతదేహన్ని జిల్లా  ఏఎస్పీ శ్రీనివాస్ సందర్శించారు.

>
మరిన్ని వార్తలు