KBR Park వద్ద విషాదం.. మార్నింగ్‌ వాక్‌కు వచ్చి

28 Jul, 2021 10:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్క్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన ఓ కానిస్టేబుల్‌ హఠాత్తుగా మరణించాడు. ఆ వివరాలు.. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్‌కోసం పార్క్‌కుకి వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడున్నవారు 108కి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపే అతడు మరణించాడు. సూర్యనారాయణ సీఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు