సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ను విజయ్ కుమార్గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.