Tamil Nadu Crime: ప్రధానోపాధ్యాయుడి పాడుపని.. మాట్లాడాలని గదిలోకి పిలిపించుకుని..

24 Jul, 2022 15:35 IST|Sakshi

వేలూరు(చెన్నై): వేలూరు జిల్లా పేర్నంబట్టు సమీపంలోని మాచంబట్టి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో పేర్నంబట్టు సమీపంలోని ఆలయ వీధికి చెందిన  పాల్‌ వణ్ణన్‌ హెచ్‌ఎంగా పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో చుట్టు పక్కలున్న గ్రామాల నుంచి  మొత్తం 75 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇదిలా ఉండగా హెచ్‌ఎం పాల్‌ వణ్ణన్‌ ఓ విద్యార్థినితో మాట్లాడాలని చెప్పి తన గదిలోకి పిలిపించుకుని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహించిన ఆమె తండ్రి హెచ్‌ఎంపై దాడి చేసి అనంతరం ఉమరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి పోక్సో చట్టం కింద హెచ్‌ఎం పాల్‌వణ్ణన్‌ను అరెస్ట్‌ చేశారు.

చదవండి: Ananthapur Woman Suicide: అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం..

  

మరిన్ని వార్తలు