వలపు వల.. వేశ్యా వాటికకు పిలిపించి 

29 Oct, 2020 06:35 IST|Sakshi
అరెస్టు అయిన హనీట్రాప్‌ ముఠా సభ్యులు

నగరంలో హనీట్రాప్‌ ముఠా అరెస్టు

వేశ్యావాటికకు పిలిపించి బెదిరింపులు   

కృష్ణరాజపురం (బెంగుళూరు): అమ్మాయిలను వల వేసి డబ్బు దండుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు ముఠాను మహదేవపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అంజలి, దీపక్, టైసన్, ప్రేమనాథ్, వినోద్, ప్రకాశ్, ఈశ్వరి తదితరులు ధనవంతులను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్‌కు పాల్పడుతున్నారు. ఈ లేఔట్‌లో ఒక వేశ్యావాటికను అడ్డాగా చేసుకుని ఈ హనీట్రాప్‌ను నడిపిస్తున్నారు. సోషల్‌ మీడియా, మొబైల్‌ ద్వారా కస్టమర్లను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వారి మాటలు నమ్మి వచ్చిన వారి వీడియోలను చిత్రీకరించి భయపెడతారు.

సదరు వ్యక్తి ఇంట్లోకి రాగానే యువతి భర్త, ఇతర స్నేహితులు లోపలికి వచ్చి హైడ్రామా సాగిస్తారు. డబ్బులను ఇవ్వాలని లేదంటే వీడియోలను బయట బహిర్గతం చేస్తామని బెదిరిస్తారు. ఈ విషయం బయటకు వచ్చిదంటే మారణాయుధాలను చూపించి చంపేస్తామని కూడా బెదిరింపులకు గురిచేస్తారు. ఇలాంటి ఘటనపై ఇటీవల ఫిర్యాదులు అందుతుండడంతో మహదేవపుర పోలీసులు రెక్కీ నిర్వహించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి కొన్ని అశ్లీల వీడియోలు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.   

>
మరిన్ని వార్తలు