హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం

1 Nov, 2020 15:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో భారీగా హవాలా నగదును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా హవాలా నగదును సీజ్‌ చేశారు.ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. ​కాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ నగదును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఓ పార్టీకి చెందిన నగదును పోలీసులు ఇలానే పట్టుకున్నారు. కాగా ఇంత పెద్ద మొత్తంలో హవాలా సొమ్మును తరలించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. 

మరిన్ని వార్తలు