ఖమ్మం మార్కెట్‌ యార్డ్‌లో అగ్గికి ఆహుతైన 1500 పత్తి బస్తాలు

10 Jun, 2023 15:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఖమ్మం: జిల్లా మార్కెట్‌ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లోని 1500 పత్తి బస్తాలు తగలబడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే యత్నం చేశాయి.

అయితే పత్తి కావడం, మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో బస్తాలు నిమిషాల్లోనే ఆహుతి అయిపోయాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

 ఇదీ చదవండి: భర్త లేడు.. ఇప్పుడు చేతికందొచ్చిన బిడ్డలు కూడా!

మరిన్ని వార్తలు