తిరువొత్తియూరు(చెన్నై): రామనాథపురం జిల్లా ఏర్వాడి సమీపం అడంచేరి గ్రామానికి చెందిన మురుగన్ (41). జాలరి. ఇతని భార్య ముత్తులక్ష్మి (35). సోమవారం రాత్రి భార్యతో గొడవపడి ఇంటిలో వున్న గ్రైండర్ రాతితో భార్య తలపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ముత్తులక్ష్మి అదే చోట మృతి చెందింది. దీంతో పోలీసులకు భయపడిన మురుగన్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మరో ఘటనలో...
తనయుడిని హత్య చేసిన తల్లి: తిరుచ్చి జిల్లా మన్నచ్చనల్లూరు కన్నియకుడికి చెందిన రాజమాణిక్యం, హంసవళ్లి దంపతులకు అమృతరాజ్, సతీష్కుమార్ అనే ఇద్దరు కుమారులు వున్నారు. గత కొన్ని రోజులుగా తనకు ఆస్తిలో వాటాను పంచి ఇవ్వాలని సతీష్కుమార్ తల్లి హంసవళ్లితో గొడవ చేస్తున్నాడు. కుమారుడి ఒత్తిడిని తట్టుకోలేక హంసవళ్లి అతని స్నేహితులకు రూ.5 లక్షలు ఇచ్చి సతీష్కుమార్ను హత్య చేయించింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు బుల్లెట్ రాజా (41), రాజా (31), సురేష్ (36), షేక్ అబ్దుల్లా (45), అరవిందస్వామి, సతీష్కుమార్ తల్లి హంసవళ్లిని అరెస్టు చేశారు.