చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త... కోపంతో కాల్చి చంపిన మహిళ

29 Jul, 2022 13:10 IST|Sakshi

భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వాళ్ల పిల్లల సంరక్షణ కోసం డే కేర్‌ సెంటర్‌లో పెట్టక తప్పని పరిస్థితి. ఉద్యోగరీత్యానే కాకుండా చిన్నచిన్న కుటుంబాలు కావడం, ఇంట్లోని పెద్దవాళ్లు కూడా చూసే అవకాశం లేకపోవటం తదితర కారణాల వల్ల చాలామంది తల్లిదండ్రులు ఈ డే కేర్‌ సెంటర్‌లనే ఆశ్రయిస్తున్నారు. ఎంత డబ్బైన పర్లేదని పెద్ద మొత్తంలో ఈ సెంటర్‌లకి ఖర్చుపెట్టి మరీ తమ పిల్లలను ఉంచుతున్నారు. అలాంటి సెంటర్లో కూడా అభం శుభం తెలియని చిన్నారుల పై లైంగిక దాడులు జరుగుతున్నాయంటే ఏమనాలి. రక్షణ అనేపదానికి అర్థం వెతుక్కోవాల్సిన స్థితికి వచ్చేస్తున్నాం. అచ్చంల అలానే అమెరికాలోని ఒక  డే కేర్‌ సెంటర్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే....యూఎస్‌లోని  వాషింగ్టన్‌లో మాండరిన్ ఓరియంటల్ హోటల్‌లో ఉంటున్న ఒక జంట డేకేర్‌ సెంటర్‌ నడుపుతోంది. అయితే భర్త జేమ్స్ వీమ్స్ జూనియర్ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అతడి భార్య శాంతేరీ వీమ్స్ గుర్తించింది. ముగ్గురు చిన్నారులపై దారుణైన అఘాయిత్యాలకు పాల్పడటంతో ఆమె సహించలేకపోయింది. దీంతో ఆమె ఈ విషయమై అతడిని గట్టిగా నిలదీసింది. కొద్దిసేపు వారి మధ్య ఘర్షణతో కూడిన వాతావరణం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆమె అతడిని తుపాకితో కాల్చి చంపింది.

ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే అతను పిల్లలను లైంగికంగా వేధించడని ఆరోపణలు చేస్తూ...అందువల్లే తన భర్తను హత్య చేశానని ఆమె చెప్పింది. వారు ఉన్న గదిలో పోలీసులకు దొరికిన ఒక డైరీ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ డైరీలో..తన భర్త ముగ్గురి పిల్లల జీవితాలను నాశనం చేశాడని, పలువురి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు రాసి ఉందన్నారు పోలీసులు.

అంతేకాదు ఒక వ్యక్తిని పక్షవాతం వచ్చే వరకు ఎలా కాల్చాలో కూడా వివిరించి ఉందని చెప్పారు. అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. ఇప్పుడు ఆ మహిళ తాను నేరం చేశానని అంగీకరించటం లేదు. దీంతో పోలీసులకు ఈ కేసు అత్యంత సవాలుతో కూడిన మిస్టరీగా ఉంది. ప్రస్తుతం ఈ విషయమై యూఎస్‌ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేకాదు సదరు నిందితురాలు ప్రాథమిక విచారణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉందని కూడా చెప్పారు. 

(చదవండి: అంత ఘోరంగా చంపాడు.. వాడి ఉరి దేశమంతా చూడాలి)

మరిన్ని వార్తలు