Banjara Hills: ప్రేమ, పెళ్లి పేరుతో జూనియర్‌ ఆర్టిస్ట్‌తో సహజీవనం.. భర్తకు విడాకులు ఇప్పించి...

13 Nov, 2021 19:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సహజీవనం చేసి మోసగించిన వ్యక్తిపై ఫిర్యాదు

సాక్షి, బంజారాహిల్స్‌: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాది కొడుకున్న తనకు భర్తతో విడాకులిప్పించి నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న యువకుడు మోసం చేశాడంటూ ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సమాచారం మేరకు.. రహ్మత్‌నగర్‌లో అద్దెకుంటున్న జూనియర్‌ ఆర్టీస్ట్‌(26)కు నాలుగేళ్ల క్రితం ప్రసాద్‌ రెడ్డి అనే వ్యక్తితో రహ్మత్‌నగర్‌ వీడియోగల్లీలో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది.
చదవండి: పెద్దసారు పాడుబుద్ధి.. విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో..

నాలుగేళ్లుగా ఇదే ప్రాంతంలో సహజీవనం చేస్తున్నది. ప్రసాద్‌రెడ్డి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. అప్పటి నుంచి జూనియర్‌ ఆర్టీస్ట్‌కు వేధింపులు మొదలయ్యాయి. తనను మోసం చేయడమే కాకుండా వేధింపులకు గురిచేస్తూ మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రసాద్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్‌ 354(డి), 420, 509 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: వీడియో వైరల్‌: మైనర్‌ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని..

మరిన్ని వార్తలు