-
సాక్షి, జవహర్నగర్( హైదరాబాద్): వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడలోని వెంకటరావునగర్కు చెందిన బనావత్ అమృ కుమార్తె శ్వేత(27)కు మే 1న నిర్చితార్థం నిర్వహించారు. ఈ నెల 11న శ్వేతకు వివాహం జరగాల్సి ఉండగా బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకి కోసం బంధువుల ఇళ్లతో పాటు సమీప ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో స్వేత తండ్రి అమృ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.