అల్వాల్‌లో దారుణం

13 Dec, 2020 15:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అల్వాల్‌లో దారుణం చోటుచేసుకుంది. కనకరాజు అనే వ్యాపారవేత్త ఓ యువకుడిని దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని శ్వశానవాటికలో పూడ్చిపెట్టాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కనకరాజు అనే వ్యాపారవేత్త ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే యువతిని శ్రీకాంత్‌ రెడ్డి అనే యువకుడు ప్రేమించాడు. ఆరు నెలల క్రితం ఆ యువతిని శ్రీకాంత్‌ రెడ్డి బయటకు తీసుకెళ్లడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.

 ఈ నేపథ్యంలో ఇద్దరిని తీసుకొచ్చిన కనకరాజు.. జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో బంధించాడు. 10 రోజుల పాటు శ్రీకాంత్‌రెడ్డిని హింసించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చిపెట్టాడు. మద్యం మత్తులో కనకరాజు ఈ విషయాన్ని తన మిత్రులకు తెలియడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్మశానానికి వెళ్లి పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసు సమక్షంలో శ్రీకాంత్‌రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.  ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.  

మరిన్ని వార్తలు