మైనర్‌పై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. 

16 Apr, 2021 14:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పరారీలో నిందితుడు

సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: ఓ బాలికపై దూరపు బంధువైన ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ నర్సింగ్‌రావు వివరాల ప్రకారం.. మూసాపేట జనతానగర్‌లో నివాసముంటున్న జై బాలు (25), ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ బాలికను గత నెల 17న తన పుట్టిన రోజు ఉందని ఇంటికి పిలిపించుకొని అత్యాచారం చేసి అర్ధనగ్నంగా ఓ సెల్ఫీ తీసి తన స్నేహితులకు పోస్టు చేశాడు.

ఆ ఫొటో బాలిక బంధువులకు చేరటంతో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఈ 10న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బలవంతంగా తనను అత్యాచారం చేసినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు జై బాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

చదవండి: గెస్ట్‌ హౌస్‌లో వ్యభిచారం.. ఇద్దరు విటులు, యువతుల అరెస్టు 

మరిన్ని వార్తలు