మాటేశారు.. 30 లక్షల సొత్తు మాయం చేశారు

3 Jul, 2021 21:56 IST|Sakshi

రూ.30 లక్షల యాపిల్‌ ఫోన్లు చోరీ

సాక్షి, కుత్బుల్లాపూర్‌( హైదరాబాద్‌): పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ఐ స్టేషన్‌ షట్టర్‌ తాళాలు పగలగొట్టి సుమారు రూ.30 లక్షల విలువచేసే ఫోన్లను  దొంగలు ఎత్తుకెళ్లారు.పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. జీడిమెట్ల డివిజన్‌ ఎన్‌సీఎల్‌ కాలనీ రెనోవా ఆస్పత్రి పక్కన ఉన్న ఐ స్టేషన్‌లో యాపిల్‌ ఫోన్లను విక్రయిస్తారు.

శుక్రవారం ఉదయం 10 గంటలకు సందీప్‌ అనే వ్యక్తి దుకాణం తెరిచేందుకు రాగా షట్టర్‌ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించాడు. దీంతో యాజమాన్యానికి తెలియజేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్‌ క్లూస్‌  టీమ్‌ , సీసీఎస్‌ సీఐ పవన్, పేట్‌బషీరాబాద్‌ డీఐ రాజులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మొత్తం 39 యాపిల్‌ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. ప్రొఫెషనల్‌ దొంగలే ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. శామీర్‌పేట్‌ సమీపంలో సైతం నాలుగు ప్రాంతాల్లో చోరీకి యుత్నించినట్లు తెలిసింది. సీఐ రమేష్‌ మరో ఆరు బృందాలు వీరి కోసం వేట ప్రారంభించారు. ఐదుగురు దొంగలు ఈ చోరీ చేసినట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు