అప్పుడు రక్షించాడు.. ఇప్పుడు వేధిస్తున్నాడు.. చివరికి

12 Aug, 2021 09:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: శంకర్‌పల్లి మండలం పిల్లిగుండ్లకు చెందిన జంగంపేట ప్రసాద్‌రెడ్డి గతంలో ఓ విద్యార్థినిని తోటి విద్యార్థి వేదింపుల నుంచి కాపాడాడు. ఆ ఘటనతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ప్రేమ పేరిట సదరు విద్యార్థినిని తానే వేధించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో ప్రసాద్‌రెడ్డి వేధింపులు శ్రుతి మించడంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ప్రసాద్‌రెడ్డిని బుధవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

చదవండి: Cyber Crime: ఫోన్‌లోనే పరిచయం, చాటింగ్‌.. అమెరికా వెళ్దామని..

మరిన్ని వార్తలు