నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

18 Jun, 2021 17:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. జయ దశరథ ప్రాజెక్ట్‌ పేరుతో ఈ ముఠా నకిలీ పత్రాలను సృష్టించి భూములు విక్రయించి..మోసాలకు పాల్పడుతోంది. వివరాలను సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. ఖాళీగా ఉన్న భూములను గుర్తించి మోసం చేయడంలో ముఠా దిట్ట అని తెలిపారు. గొల్లూరు గ్రామంలో నకిలీ పత్రాలతో 40 ఎకరాల భూమిని ముఠా విక్రయించినట్లు సీపీ తెలిపారు. డబ్బు తీసుకుని అగ్రిమెంట్ చేయకపోవడంతో బాధితుడు ఫిర్యాదు చేశారని.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ సజ్జనార్‌ తెలిపారు.

చదవండి: చిన్నారి అనుమానాస్పద మృతి; నీటిట్యాంకులో మృతదేహం
ఏమిటి జోకర్‌ యాప్స్‌.. బహుపరాక్‌

మరిన్ని వార్తలు