పోలీసు కస్టడీకి డ్రగ్స్‌ కేసు నిందితులు 

15 Apr, 2022 01:14 IST|Sakshi
అనిల్‌ను తీసుకొస్తున్న పోలీసులు  

బంజారాహిల్స్‌: పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులు ఉప్పల అభిషేక్, మహాదారం అనిల్‌కుమార్‌ను గురువారం బంజారాహిల్స్‌ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న వీరిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. డ్రగ్స్‌ పార్టీపై గురువారం నుంచి 4 రోజులపాటు పోలీసులు ప్రశ్నించనున్నారు.

ఈ నెల 3న పబ్‌పై పోలీసులు జరిపిన దాడుల్లో కొకైన్‌ బయటపడటంతో పబ్‌ మేనేజర్‌ అనిల్, భాగస్వామి అభిషేక్‌పై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా అనిల్, ఏ–2గా అభిషేక్‌ను చేర్చారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు అర్జున్‌ వీరమాచినేని, కిరణ్‌రాజ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు